TV 9 Ex CEO Ravi Prakash: టీవీ 9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు లేవనీ, అన్నీ చట్టబద్దంగానే జరిగాయాని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ తీర్పు ఇచ్చింది. టీవీ 9కి చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన లా ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్ లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్, ఇతరులు ఈ పిటిషన్ వేశారని బెంచ్ అభిప్రాయపడింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టీవీ 9 వాటాల విక్రయ ఒప్పందం గురించి పిటిషనర్ రవిప్రకాష్ కు తెలిసే జరిగిందనీ, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంది. ఇందుకు గానూ ప్రతివాదులకు పది లక్షలు పరిహారం చెల్లించాలని రవిప్రకాష్, కేవిఎన్ మూర్తిలను ఆదేశించింది లా ట్రైబ్యునల్. టీవీ 9 ప్రమోటర్ ఏబీసీపీఎల్ లో రవిప్రకాష్ కు తొమ్మిది శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ నుండి సీఇఓ రవిప్రకాష్, సీఎఫ్ఓ మూర్తిలను తొలగించడం కంపెనీల చట్టం అనుగుణంగానే జరిగిందని, ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని బెంచ్ పేర్కొంది. కంపెనీ యాజమాన్యం బదిలీలో అవకతవకలు జరిగినట్లు పిటిషనర్ నిరూపించలేకపోయారని బెంచ్ స్పష్టం చేసింది.