మహమ్మారి కరోనా వైరస్ అంటే మొదటి లో ఉన్న భయం ప్రస్తుతం మనుషులకు లేదు. చాలా వరకు సాధారణ దగ్గు జ్వరం లాగా ట్రీట్ చేస్తున్నారు. వైరస్ వచ్చిన కానీ అతి తక్కువ సమయంలోనే చికిత్స తీసుకుని బయట పడుతున్నారు. మరికొంతమందిలో వైరస్ వచ్చినట్లు పోయినట్లు కూడా తెలియటం లేదు. ఇదిలా ఉంటే కొంతమంది లో కరోనా వచ్చి కోలుకున్న తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రిపోర్టు నెగిటివ్ వచ్చినా గానీ శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. వెక్కిళ్లు చాలాసేపు రావటం తో పాటు అది తగ్గిపోయిన తర్వాత కంటి సమస్యలు ఏర్పడటం ఇప్పుడు వైద్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. అంత మాత్రమే కాక పంటి సమస్యలు కూడా వస్తున్నాయట. ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్నాక కొంతమందిలో ఎలాంటి నొప్పి లేదా రక్తస్రావం లేకుండానే పళ్లు ఊడిపోతున్నాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు.
అయితే అన్నిటికంటే కంటి సమస్య విషయంలో కరోనా వచ్చిన తర్వాత అశ్రద్ధ చేస్తే మాత్రం చూపు మొత్తం కోల్పోయే అవకాశం ఉందని కాబట్టి కరోనా వచ్చిన తర్వాత రిపోర్ట్ నెగటివ్ వస్తే కంటి సమస్యలు ఏర్పడితే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండోరకం కరోనా వైరస్ రావడంతో ఇప్పుడు దీనికి సంబంధించి సరికొత్త లక్షణాలు బయటపడటంతో ప్రజలు అనేక భయాందోళనలకు గురవుతున్నారు. ఏ లక్షణం ఏ వైరస్ కి సంబంధించి అన్న దాని విషయంలో కన్ఫ్యూజన్ ఎదుర్కొంటున్నారు.