నెల్లిమర్ల, జనవరి 10: విజయనగరం జిల్లా, నెల్లిమర్ల జ్యూట్ మిల్కు అర్ధరాత్రి యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. సంక్రాంతి పండుగ ముందు మిల్లు మూతపడటంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లులో దాదాపు మూడు వేల మంది పర్మినెంట్, రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు.
ఒక పక్క పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో ఒక కంపెనీ లాకౌట్తో కార్మికులు రోడ్డున పడ్డారు. కార్మికశాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.