ఈ మధ్య కాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ హవా ఎక్కువ అయిపోయింది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం కంటే ఇంటిలో ఫోన్ లోనే కూర్చుని వీక్షించేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా కొత్త సినిమాలను అధిక ధరలకు కొనేస్తూ ప్రేక్షకులకు సినిమా చూడడం మరీ ఈజీ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఒక ఓటిటి ప్లాట్ఫార్మ్ స్థాపించాడు. మొదట్లో కొద్దిగా డల్ గా ఉన్న ఈ అప్లికేషన్ ఇప్పుడు క్రమంగా పుంజుకుంది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ అన్నింటిలో లో ‘నెట్ ప్లిక్స్’ నెంబర్ వన్ అని ఒప్పుకోవాలి. ఈ ప్రపంచవ్యాప్త దిగ్గజం ఓటిటి సంస్థ భారతదేశంలో రీజినల్ కంటెంట్ ప్రోత్సహించడం ఈ మధ్యనే మొదలు పెట్టింది.
అయితే తొలిసారి తెలుగులో ‘పిట్ట కథలు అనే’ ఒక అంథాలజీ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ పిట్టకథలు హిందీలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’ కు రీమేక్. నలుగురు తెలుగు దర్శకుల పర్యవేక్షణలో మంచి కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ పిట్టకథలు కి సంబంధించి నెట్ఫ్లిక్స్ వారు మేము తొలిసారి తెలుగు కంటెంట్ తీసుకు వస్తున్నాం అని బాగా ప్రేక్షకుల్లో హైప్ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
అయితే ఒరిజినల్ తెలుగు స్ట్రీమింగ్ అప్లికేషన్ అయినవారు ‘ఆహా’ వారు నెట్ ప్లిక్స్ పై సెటైర్ వేశారు ట్విట్టర్ ఒక పిక్చర్ వేసి…. మనది ఎలాగో 100% ఒరిజినల్ తెలుగు నే కదా…. ఇక బ్రషింగ్ లు అవసరం లేదు అని నెట్ఫ్లిక్స్ వారికి సెటైర్ వేశా. అంతేకాకుండా కింద క్యాప్షన్ లో “మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి… మేము అరుస్తున్నామా” అని అన్నారు.
అందుకు నెట్ఫ్లిక్స్ వారు ఈరోజు రిప్లై ఇచ్చారు. ఒక ఫోటో ని వేసి ‘నో ఫైటింగ్… బాధ్యత ఉండక్కర్లేదా?” అని వేశారు. పైన “వీడు…. వీడి వేషాలు” అని కౌంటర్ పోస్టుని ట్వీట్ రూపంలో వేశారు. ఇలా నెట్ఫ్లిక్స్, ఆహా ఒకరితో ఒకరు పంతానికి పోయి పోట్లాడుకోకుండా మంచి ఆరోగ్యకరమైన కాంపిటీషన్ తో ముందుకు సాగితే మంచిది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.