రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బిజీ హీరోయిన్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ .. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో వరసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. స్టార్స్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో మన్మదుడు 2 తర్వాత మళ్ళీ మంచి అవకాశాలు దక్కించుకుంటున్న rakul preet singh రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో నటించింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ఈ సినిమాకి కొండపొలం అన్న టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే యంగ్ హీరో నితిన్ సరసన చెక్ అన్న సినిమా చేస్తోంది rakul preet singh.
ఈ సినిమాకి చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అంతేకాదు మళ్ళీ ఈ సినిమాలతో rakul preet singh టాలీవుడ్ లో ఫాం లోకి వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మరొకొన్ని సినిమాలకి సంబంధించి చర్చలు సాగుతున్నాయట. ఇక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది rakul preet singh. ఇప్పటికే అక్కడ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు సైన్ చేసింది.
కాగా అజయ్ దేవగన్ నిర్మిస్తున్న మేడే సినిమా షూటింగ్ లో రీసెంట్ గా జాయింది rakul preet singh. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ 12 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ షూటింగ్ కి వెళ్లిందట. ఈ విషయం తానే స్వయంగా తెలిపిన రకుల్.. వర్కౌట్ టైం సేవ్ చేసుకుంటూ తను నటిస్తున్న ‘మేడే’ సెట్స్ కి వెళ్ళినట్లు తెలిపింది. ఇంతకముందు rakul preet singh వర్షంలో మంచు లక్ష్మీ తో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఇద్దరు 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. ఇక మేడే సినిమాలో అజయ్ దేవగన్ – అమితాబ్ లతో కలిసి నటిస్తున్న రకుల్.. అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది.