WhatsApp: ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కు కొన్ని వందల బిలియన్ల యూజర్లు ఉన్నారు. అయితే ఇటీవల వాట్సాప్ ప్రైవసీ పాలసీ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రజల వ్యక్తిగత సంభాషణలను వాట్సాప్ సిస్టర్ కంపెనీ అయిన ఫేస్బుక్ తో పంచుకుంటుంది అంటూ ఎనో వార్తలు వచ్చాయి. ఇందుకుగాను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ పై వ్యతిరేకత వచ్చింది. ఇక చేసేదేమి లేక ప్రజలు వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్ ల కోసం వెతుకుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని మార్కెట్ లోకి ఎన్నో కొత్త కొత్త ప్రైవేట్ కంపెనీ ల యాప్ లు మార్కెట్ లోకి వచ్చాయి.
ఇది గమనించిన భారత కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీ ల వలన మళ్ళి ఇదే సమస్య ఎదురవుతదని భావించి వాట్సాప్ యాప్ కు ప్రత్యామ్నాయంగా ‘సందేశ్’ అనే యాప్ను ను ప్రజల ముందుకి తీసుకొచ్చింది.
ఈ సందేశ్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించింది. ఇక సందేశ్ యాప్ విషయానికి వస్తే ఈ యాప్ ని ఉపయోగించాలంటే తప్పనిసరిగా మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఉండాలి. వాట్సాప్ లో లాగానే సందేశ్ యాప్ లో కూడా మెసేజ్ లు, ఫొటోలు మరియు వీడియోలు పంపించుకోవచ్చు. జీఐఎంఎస్ అనే ప్రభుత్వ పోర్టల్ లో దీనికి సంబంధించిన APK ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్లో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ సందేశ్ యాప్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వెరిఫైడ్ అకౌంట్ ఆప్షన్ ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం భారతీయులు ఎక్కువగా టెలిగ్రాం మరియు సిగ్నల్ యాప్స్ ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ దేశీ యాప్ ను ప్రజలముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.