జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైఫరీ (జి.ఎన్.ఎం) అనేది క్లినికల్ నర్సింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారి కోసం రూపొందించిన మూడున్నర సంవత్సరాల డిప్లొమా కోర్సు. ఇందులో అభ్యర్థులకు పూర్తిస్థాయిలో కోలుకోవటానికి, అనారోగ్యంతో కానీ గాయపడిన వ్యక్తులను ఎలా చూసుకోవాలో నేర్పుతుంది.ఇంటర్లో బైపిసి గ్రూపు తీసుకున్నవారు ‘బీఎస్సీ నర్సింగ్’ చేయడానికి అర్హులు. కానీ జి.ఎన్.ఎం డిప్లమో కోర్సును సైన్స్ గ్రూప్ వారే కాకుండా ఆర్ట్స్ గ్రూప్ వారు కూడా చదవచ్చు.
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కమ్యూనిటీ హెల్త్ నర్సులుగా, ఫోరెన్సిక్ నర్సింగ్, క్లినికల్ నర్స్ స్పెషలిస్టు, ట్రావెలింగ్ నర్సు తదితర హెూదాల్లో సేవలందించడానికి వీలుంటుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లో వైఎస్సార్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జీఎస్ఎం నర్సింగ్ సేవల ఆవశ్యకత వుంది. ముఖ్యంగా గ్రామాల్లో గర్భిణులకు విలువైన సూచనలు చేస్తారు. ప్రసవానికి ముందు తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలో తెలియజేస్తారు. రక్తహీనత లేకుండా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా అవగాహన కల్పిస్తారు. పేదలకు సేవలందించడంలో వీరి పాత్ర కీలకమైనది. జీఎస్ఎం నర్సింగ్ కోర్సులో శిక్షణ అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో 400 వరకు శిక్షణ సంస్థలున్నాయి. కోర్సును అభ్యసించడానికి ఫీజు తక్కువగా వుండడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాయితీ లభించడంతో ఎక్కువ మంది విద్యార్థులు జి.ఎన్.ఎంనర్సింగ్ కోర్సు పట్ల అసక్తి చూపుతున్నారు.
ఆసుపత్రులు, క్లినిక్లు, ఆరోగ్య విభాగాలలో ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్ హెల్త్ కేర్ గా పని చేయవచ్చు. జిఎన్ఎమ్ డిప్లొమా హోల్డర్లు కమ్యూనిటీ సేవలను, వైద్య అవగాహనను వ్యాప్తి చేయడం. రోగులకు సహాయపడే ఎన్జిఓల కోసం పని చేయవచ్చు.పారిశుధ్య కార్మికుల తరహాలోనే ఫ్రంట్ వారియర్స్ గా వుంటూ మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. సాధారణంగా జిఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి 15 వేల 18 వేల వరకు జీతం వుంటుంది. దేశంలో నర్సింగ్ విద్యను పూర్తి చేసుకున్న వారిలో 50 శాతం మంది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే వుంటున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చిన సంస్థలు అధికంగా వున్నాయి. ఈ కోర్స్ కు వచ్చే సంవత్సరానికి శిక్షణ పొందడానికి వీలుగా ప్రవేశాలు జరుపుకోవచ్చని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) తాజాగా నిర్ణయించింది.