ఢిల్లీ జనవరి 25: రాజకీయంగా ఎంతో సున్నితమైన వివాదాస్పదమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
అయోధ్య వివాదం పై కేసు విచారణకు తొలుత ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజాన్ గొగొయ్ మార్పులు చేశారు.
తొలుత పేర్కొన్న ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లలిత్ స్థానంలో కొత్తగా జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్ లను తీసుకున్నట్లు ప్రకటించారు.
ఈ నెల పదవ తేదీ కేసు విచారణ సమయంలో ధర్మాసనంలో ఒక సభ్యుడిగా యు యు లలిత్ ఉండటంపై న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో అయోధ్య కేసు విషయంలో కళ్యాణ్ సింగ్ తరపున జస్టిస్ లలిత్ వాదించి ఉన్నారు. దీంతో ధర్మాసనంలో కొనసాగలేనని జస్టిస్ లలిత్ స్వచ్చందంగా తప్పుకున్నారు.