కరోనా కొత్త స్ట్రెయిన్ తో బ్రిటన్ ను వణికిస్తోంది. బ్రిటన్ నుంచి వేరే దేశాలకు రాకపోకలను నిలిపివేస్తూ బ్రిటన్ లో చాలా కఠినమయిన నిబంధనలను విధించారు. బ్రిటన్ నుంచి కరోనా వాక్సిన్ అందుతుందని ప్రపంచ దేశాలన్నీ వేయి కళ్ళతో ఎదురుచూసాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ప్రజలకు అందేలోపు కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తితో ఆ ఆనందం కాస్తా ఆవిరి అయ్యింది. ఈ వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టడానికి ఇంగ్లండ్ లోని దాదాపు 60 లక్షల మంది ప్రజలపై కఠిన ఆంక్షల్ని విధించింది బ్రిటన్. దీనితో ప్రపంచమంతా ఆందోళనకు గురయ్యింది.
ఇంగ్లండ్ లోని కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిబంధనల్ని విధించారు. దీంతో బ్రిటన్ లో కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి అమలు లోకి వచ్చాయి. ఇప్పటివరకు బ్రిటన్ లో కరోనా కారణంగా 70 వేల మంది మరణించారు. ఇటీవల క్రిస్మస్ కారణంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాప్తి చెందినట్లుగా భావిస్తున్నారు. నమోదవుతున్న కేసులను చూస్తుంటే ఈ వాదనకు బలం చేకూరేలా ఉంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ తరువాత రోజు నుంచి బ్రిటన్ లో భారీ ఎత్తున ఆంక్షల్ని విధించారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే తాజాగా స్కాట్లాండ్ మరియు నార్త్ ఐర్లాండ్ లో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయట. దీంతో అక్కడ కూడా కఠినమయిన లాక్ డౌన్ నిబంధనలను విధించినట్లు తెలుస్తుంది. అక్కడి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
తాజా పరిణామాలను ఆధారం చేసుకుని నార్త్ ఐర్లాండ్ లో ఆరు వారాల వరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. అక్కడి ప్రజలకు కేవలం ఆహార పదార్థాల్ని తీసుకెళ్లేందుకు మాత్రమే అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఇక ఈ మహమ్మారి మన దేశంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుందో!!