ఎన్ని ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తున్న కరోనా వైరస్ అరికట్టడం కోసం ఇప్పటి వరకు సరైన వాక్సిన్ గాని మందు గాని మార్కెట్లోకి రాని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కరోనా వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. మరోవైపు రోజుకి భయంకరంగా కొత్త పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో… రాష్ట్రంలో చాలావరకు ప్రాంతాలు రెడ్ జోన్ లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో తెరాస ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఏకంగా పోలీసులకు రాజకీయ నాయకులకు కరోనా వైరస్ సోకే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడంతో మరోసారి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా లాక్ డౌన్ లో కి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల 180 మంది పోలీస్ అకాడమీ కి చెందిన పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవటం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అకాడమీ డైరెక్టర్ వికె సింగ్ షాకింగ్ విషయం బయటపెట్టారు.
కరోనా పాజిటివ్ వచ్చిన 180 మంది పోలీసులకు ఎటువంటి లక్షణాలు లేవని…కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఏ లక్షణాలు లేకుండా కూడా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల మరింతగా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఏదిఏమైనా కరోనా వైరస్ లక్షణాలు లేకుండా కూడా కరోనా వ్యాప్తి ఉన్న తరుణంలో…బయట తిరుగుతున్న మనుషుల దగ్గర చాలా జాగ్రత్తగా ప్రస్తుతం ఉండాలని, ప్రభుత్వం సూచిస్తున్న సూచనలను పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలని వైద్యులు తెలుపుతున్నారు.