North Korea: ప్రపంచంలో కరోనా విలయతాండవం సృష్టించిన ప్రారంభంలో ఉత్తర కొరియా లో ఒక్క కరోనా కేసు బయటపడలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా చాలా సాధారణ స్థితిలో ఉన్న సమయంలో… ఉత్తర కొరియా మాత్రం మహమ్మారి ధాటికి దడ దడ లాడుతోంది. ఏకంగా రోజుకి 50 వేల కేసులు నమోదవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. చాలావరకు లక్షణాలు జ్వరంతో పాటు దగ్గు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో మొత్తం కేసుల సంఖ్య నలభై లక్షలకు పైగానే ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కరోనాతో పాటు మరో కొత్త అంటువ్యాధి ఉత్తర కొరియా దేశాన్ని ఒణికిస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేటర్ లోకి వెళితే ఉత్తర కొరియా దేశంలో ఓడరేవు నగరమైన హేజులో అంతుచిక్కని ఒక విచిత్రమైన అంటు వ్యాదితో ప్రజలు బాధపడుతున్నారు. పేగు సంబంధిత వ్యాధి తరహాలో వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య మాత్రం బయటకు రానివ్వకుండా అక్కడి అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది ఒక మరో వైరస్ అయితే మిగతా ప్రపంచ దేశాలకు పెను ప్రమాదమే అని తాజా వార్తల పై మిగతా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే కరోనా వైరస్ అరికట్టే విషయంలో చైనా దేశానికి సరిహద్దు ప్రాంతాలలో ఉత్తరకొరియా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. చైనా సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ప్రజలు తలుపులు, కిటికీలు మూసి వేయాలని… తెరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంట. ఉత్తర కొరియా తో పాటు చైనాలో కొన్ని ప్రాంతాలలో వైరస్ భారీ ఎత్తున విజృంభిస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. దీనికి తోడు కొత్త అంటువ్యాధి బయటపడటంతో.. అక్కడ ప్రభుత్వ అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?