తెలుగు బుల్లితెర మీద ఎంత కామెడీ పండించినా.. ఎన్ని కామెడీ షోలు వచ్చినా ఇంకా దాని స్పేస్ దానికి ఉంటుంది. ఎందుకంటే ఎంటర్ టైన్ మెంట్ దే హవా ఇక్కడ. ఎంత వినోదాన్ని పంచితే అంత పాపులారిటీ. ప్రేక్షకులు ఎక్కువగా వినోదానికి అలవాటు పడిపోయారు. కాబట్టి.. వాళ్లకు వినోదాన్ని పంచడం కోసం టీవీ చానెళ్లు ఎంటర్ టైన్ మెంట్ షోల వేటలో పడ్డాయి.
ఇప్పటికే ఈటీవీలో జబర్దస్త్ లాంటి కామెడీ షో ఉంది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ లోనూ ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ లేదు. అయినప్పటికీ.. శ్రీదేవీ డ్రామా కంపెనీ పేరుతో మరో షోను మనముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ముఖ్య ఉద్దేశమే ఎంటర్ టైన్ మెంట్ ను పంచడం.
ఈ షోలో సీరియన్ నటుడు అర్జున్ మొదటి సారి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక జబర్దస్త్ టీమ్ మొత్తం కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయనుంది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ జంట, సునామి సుధాకర్, పొట్టి నరేశ్.. వీళ్లంతా కలిసి చేసే హంగామా మామూలుగా ఉండదు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను రిలీజ్ చేశారు. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఓ లుక్కేయండి మరి..