ఓ వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరులో ప్రధాన పార్టీలు ఎత్తుగడలతో ముందుకు సాగుతుంటే మరోవైపు ముఖ్య నేతలను టార్గెట్ చేయడంలోనూ నాయకులు బిజీగా ఉన్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఈ క్రమంలో ఆ పార్టీ ముఖ్యనేత రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిందని అంటున్నారు. ముఖ్య నేతలను పార్టీలోకి లాగడం అనే స్కెచ్తో పాటుగా రేవంత్కు షాక్ ఇవ్వడం అనే పనిలోనూ బీజేపీ బిజీగా ఉందంటున్నారు.
బీజేపీ కొత్త ప్లాన్ ఇదే
గ్రేటర్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడం అనే గేమ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడం అనే పనిలోనూ బీజేపీ బిజీగా ఉంది. గ్రేటర్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్ను ముమ్మరం చేసి. బీజేపీ ఈ క్రమంలో పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలపై కమలదళం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ను కలిసి పార్టీలోకి బీజేపీ నేతలు ఆహ్వానించారు. కిషన్రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్ స్వయంగా స్వామిగౌడ్ను కలిశారు.
రేవంత్ అనుచరులపై
నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ నాయకులు తెరలేపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ఉధృతం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణతో చర్చలు సఫలం కావడంతో ఆయన పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆయన అనుచరుల్లో కొందరిని పార్టీలో చేర్చుకున్నారు. రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సైతం లైన్లో పెట్టిందని సమాచారం. అయితే, బీజేపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. మరో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్తో సైతం బీజేపీ చర్చలు జరుపుతోందని సమాచారం.