తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆభరణాల లెక్కింపు కోసం కొత్త పోస్టులను ఏర్పాటు చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపు మరియు తనిఖీల కోసం ఎనిమిది కొత్త పోస్టులకు ఆమోదం తెలుపుతూ ఆదేశాలు జారీ చేసారు.
ముఖ్య ఆభరణాల అధికారితో పాటు విడుదల చేసిన పోస్టులలో సహాయ ఆభరణాల అధికారులు ఏఈఓలతో పాటు నాలుగు జ్యువెలరీ అప్రైజర్ పోస్టులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలతో సహా అనుబంధ ఆలయాల్లో ఆభరణాలు లెక్కింపు కోసం ఈ కొత్త పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. తిరుమల తిరుపతి ట్రస్టు బోర్డులో తీర్మించిన వాటి ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టిటిడి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి కలిశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం ను ఆహ్వానించారు.