ప్రపంచంలో ఎనిమిదో వింత చోటు చేసుకుంది.ఒక్కసారిగా మూగవాడు మాట్లాడి నట్టయింది. ఇది చూసి ఆంధ్రప్రదేశ్ అవాక్కయింది.
మరి సరిగ్గా తెలుగు మాట్లాడ్డం రాదని అవహేళనకు గురి అవుతున్న నారా లోకేశ్ ఏకంగా తెలుగు రచయితగా మారాడంటే ఇలాంటి రియాక్షన్సే వస్తాయి.టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాలమిస్ట్ అవతారం ఎత్తారు. ఇందుకు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీ వేదికైంది. గత నెల ఆగస్టు 15న ‘జగన్మోసావతారం’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలోనారా లోకేశ్ పేరుతో వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసంలో కరోనా బారిన పడి ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలో ఫిడేలు వాయించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ప్రతి రోజూ 10 వేల కరోనా కేసులు, 100 మరణాలు సంభవిస్తున్నాయని నారా లోకేశ్ విలవిలలాడారు. అలాగే కరోనా బాధితులు వైద్యం అందక , వసతులు లేక ప్రాణాలు రక్షించమని వేడుకుంటున్నారని, 108 అంబులెన్స్లు ఏవీ? అని నిలదీస్తూ లోకేశ్ ఆర్టికల్ సాగింది.తాజాగా అదే ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో నారా లోకేశ్ పేరుతో మరో ఆణిముత్యం లాంటి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ‘దళిత పక్షపాతి- ఎవరు, ద్రోహి ఎవరు?’ అనే శీర్షికతో వైసీపీని దళిత వ్యతిరేక పార్టీగా, టీడీపీని దళితోద్ధారక పార్టీగా చిత్రీకరించేందుకు నారా లోకేశ్ పేరిట ఘోస్ట్ రైటర్ పడిన తపన అందులో కనిపిస్తుంది.సరే నారా లోకేష్ రాస్తున్న వ్యాసాలు కాబట్టి అందులో వైసీపీ పాలనపై విమర్శలు తప్ప మరొకటి ఉండవని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.
పైగా వాటిని ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి కాబట్టి ఆ వ్యాసాల గురించి చెప్పుకోవడం అనవసరం.ఇలాంటి వ్యాసాలతో ఒరిగేదేమీ ఉండదు. తన పేరుతో ఆర్టికల్ పబ్లిష్ అయిందనే ఆత్మసంతృప్తి తప్ప. రాజకీయాల్లో ఎదగాలనుకునే వాళ్లు ఇలాంటి చిల్లరమల్లర వేషాలు వేయడం సరికాదు.అసలు కాలమిస్టు అవతారం ఎత్తమని లోకేషు కి సలహా ఇచ్చిందెవరు ?ఆయన పేరుతో రాస్తున్న ఘోస్టు రైటర్ ఎవరన్నదే ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశం. లోకేష్ అన్ని విషయాల్లో మెరుగయ్యాడని లోకానికి చాటి చెప్పడానికే ఈ తరహా ఎత్తుగడలను టిడిపి వేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.లోకేష్ ఈ వ్యాసాలు రాస్తున్నారంటే నమ్మే వాళ్లెవ్వరూ ఏపీలో కనిపించటం లేదు.