Superstitions: ఇటీవల జరిగిన మదనపల్లె జంట హత్య కేసుని ఇంకా మరువక ముందే అదే తరహాలో మూఢనమ్మకానికి మరో ప్రాణం బలైంది. ఓ యువతీ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమెను ఆత్మ ఆవహించిందని అభిప్రాయపడి ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళాడు ఆమె తండ్రి. చివరికి ఆమెకు వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగింది. వివరాలలోకి వెళితే….
తమిళనాడు లో తరణి అనే ఓ 19 ఏళ్ల యువతి తండ్రి మూఢనమ్మకాలను బాగా నమ్ముతుంటారు. తరణి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మూఢనమ్మకాలపై విశ్వాసం ఉన్న ఆమె తండ్రి తరణి ని ఆస్పత్రికి బదులుగా ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే ఆమె తండ్రి ఇలా తీసుకువెళ్ళడానికి కారణం లేకపోలేదు. తొమ్మిదేళ్ల క్రితం తరణి వాళ్ళ అమ్మ మరణించగా ఆమె ఆత్మ ఇప్పుడు తరణి లోకి ప్రవేశించిందని భ్రమించి ఆమెను భూతవైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. తరణి తరచూ ఆమె తల్లి సమాధి వద్దకు వెళ్లి వస్తు ఉండేది.
అయితే చివరిగా ఆమె తన తల్లి సమాధి దగ్గరకు వెళ్లినప్పటి నుంచే ఇలా అనారోగ్యంకు గురి అయ్యిందని తన కూతురిలోని దయ్యాన్ని వదిలించాలని ఒక తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లి పూజలు చేయించగా అక్కడ ఆ తాంత్రికుడు అరిచిన అరుపులకు మరియు అక్కడి పొగకు ఆమె సొమ్మసిల్లింది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు ఆమెను తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. అంతేకాకుండా డాక్టర్ లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె చాలా రోజుల నుంచి టైఫాయిడ్ తో బాధపడుతున్నందున చికిత్స అందకపోవడంతో ఆమె చనిపోయిందట.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.