గత ఏడాది సంక్రాంతి పండుగకు “సరిలేరు నీకెవ్వరు” సినిమా రిలీజ్ చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ మహేష్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. “సరిలేరు నీకెవ్వరు” సినిమా రిలీజ్ కి ముందు భరత్ అనే నేను, మహర్షి భారీ విజయాలు సాధించటం మనకందరికీ తెలిసిందే.
ఇలాంటి తరుణంలో “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమాని ఓకే చేయగా కరోనా వైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇప్పటివరకు సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలు కాలేదు. మొన్నటి వరకు అమెరికాలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుద్ది అని వార్తలు రాగా అక్కడ కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పాటు అధ్యక్ష ఎన్నికలు జరగటంతో వాయిదా పడినట్లు చెప్పుకొచ్చారు.
ఇటువంటి తరుణంలో హైదరాబాదులో మరో కొత్త షెడ్యూల్ తో ఇక్కడే షూటింగ్ స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అవ్వగా తాజాగా మరో కొత్త అడ్డంకి ఏర్పడినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే కొత్త సంవత్సరంలో అమెరికా కి బదులు దుబాయిలో సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేయాలని మహేష్ బాబు అండ్ టీం అనుకోగా అక్కడ ప్రభుత్వాల నుండి సరైన అనుమతులు రావటం లేదని దీంతో దుబాయ్ షెడ్యూలు కూడా పక్కన పెట్టే ఆలోచనలో మహేష్ కొత్త సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.