కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకినా లక్షణాలు అంత త్వరగా బయటపడటం లేదు. ఫలితంగా బాధితులు తమకు తెలియకుండా ఆ వైరస్ను ఇతరులకు అంటిస్తున్నారు. కరోనా టెస్ట్ చేయించుకోవడం అంటే ఎంత ప్రయాసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంటల వ్యవధి క్యూలైన్లలో నిల్చోవటం, పాజిటివా? నెగెటివా? తెలుసుకోవడం కోసం రోజుల తరబడి వెయిట్ చేయడం ఇంతలో టెన్షన్ పడ్డాడం. ఇది అంత కరోనా టెస్ట్ చేయించుకోవడానికి ప్రజలు పడే కష్టాలు. అయితే ఇప్పటికే వైరస్ నిర్ధారణకు పలు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ఇందులో ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు ముఖ్యమైనవి. ఇప్పుడు కొత్త రకం పరీక్ష కిట్ కు ఆమెరికాలోని ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్ డీ ఏ ఆమోదం తెలిపింది. ఈ కిట్ చాల చవక ధరలో దొరుకుతుంది. దీనిపేరు ‘లూసిరా కొవిడ్-19 ఆల్ ఇన్ వన్ కిట్’. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ తీవ్రత తగ్గించడంలో ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
కరోనా సోకిందో లేదో పది నిమిషాలలో ఇంట్లోనే కూర్చొని టెస్ట్ చేసుకోవచ్చు అన్ని, జర్మనీకి చెందిన మల్టీ- జీ అనే సంస్థ ప్రకటించింది. ఐరోపా సహా ప్రధాన మార్కెట్లలో వీటిని పంపిణీ చేసేందుకు దేశీయ ఫార్మా కంపెనీ సిప్లా.. మల్టీ-జీతో ఒప్పందం కుదుర్చుకొంది. కొవి-జీ పేరిట వీటిని విక్రయించనున్నారు. రక్తంలో ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు ఆనవాళ్లను గుర్తించడం ద్వారా కరోనాను నిర్ధారిస్తారు. ఈ కిట్లు 92శాతం కచ్చితత్వంతో పనిచేస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ కిట్ వల్ల కచ్చితం అయినా ఫలితం రావడం తో, వైరస్ సోకినా వారికీ ట్రీట్మెంట్ సరే అయినా సమయంలో అందుతుంది. అలాగే వైరస్ వ్యాప్తించడం కూడా తగ్గుతుంది అన్ని నిపుణులు తెలిపారు.