భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి నుంచే విదేశాల నుంచి రాకపోకలను నిలిపివేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు అందాయి. కానీ అప్పట్లో కేంద్రం ఈ విజ్ఞప్తులని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించి దాదాపు లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ తీవ్రత నుంచి ఇప్పుడిప్పుడే మన దేశం కోలుకుంటున్న తరుణంలో బ్రిటన్ లో కొత్త కరోనా స్స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ నుంచి వచ్చే విమాన సర్వీసులను వెంటనే రద్దు చేసింది. అలాగే నవంబరు 25 నుంచి డిసెంబర్ 23 వరకు బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికులను స్ట్రెయిన్ నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో వేల మందిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించింది. అయితే వీరుకాకుండా మరికొన్ని వేల మంది ఉన్నారని వారి జాడ తెలియయడంలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఎయిర్ లైన్స్ సంస్ధల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మాత్రమే వీరిని గుర్తిస్తున్నారు.
కేంద్రం వారిని గుర్తించలేకపోవడానికి ప్రధాన కారణం ప్రయాణికులు ఎయిర్ లైన్స్ కి ఇచ్చిన అడ్రస్లు ఫోన్ నంబర్లలో చాలా వరకు నకిలీవే అని తేలింది. ఇదిలా ఉండగా మరికొందరు విమానాశ్రయాల్లో ప్రాధమిక పరీక్షలు నిర్వహించే ముందే తప్పించుకుని స్వస్ధలాలకు చేరుకున్నారు. దీంతో వీరిని గుర్తించడం కేంద్రానికి చాలా కష్టంగా మారింది.
అయితే వారు భారత్ లో ఇచ్చిన అడ్రస్లు కూడా తప్పుగా తేలడంతో అధికారులు ఏమి చేయలేక తలపట్టుకుంటున్నారు. ఇప్పటికైనా వారందరు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకుంటే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని కేంద్రం సూచిస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?