పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో తాజాగా ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ధైర్యంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు ఆ ప్రేమ జంట. కానీ ఆ తర్వాత వారికి భయపడ్డారు. ఇంట్లోకి ఇలా వెళ్తే పెద్దలు ఎలా స్పందిస్తారో అన్న భయంతో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఎంవీ-42 గ్రామానికి చెందిన బిక్కి సుఖ్ధర్ మరియు సోరిత గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో వీరిపై మండిపడ్డారు. ఎట్టిపరిస్థుతులలో తమ ప్రేమను అంగీకరించబోమని పెద్దలు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో తమ పెద్దలు తమ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు అని అర్ధం అయ్యి ఆ ప్రేమికులు రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం రహస్యంగా వేరే ఊరు చేరుకొని అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు. ధైర్యం చేసి పెళ్లి కూడా చేసుకున్నారు కానీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి వారికి ధైర్యం సరిపోలేదు.
ఈ సమస్యకు ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని భావించి గ్రామ శివారులోని ఓ మర్రి చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు చనిపోయారు. మరునాటి ఉదయం వారి మృతదేహాలను చుసిన గ్రామస్తులు వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఆ తరువాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.