Newlywed couples: మన సంప్రదాయాలు ఆచారాల లో పెద్దలు చెప్పిన దాని వెనుక ఓ అర్థం, పరమార్థం తప్పకుండా ఉంటుంది. ఆషాడ మాసం లో కొత్తగా పెళ్లైన వారు కలిసి ఉండకూడదు అని ఓ ఆచారం ఉన్న సంగతి మనందరికీ తెలుసు .. దాని వెనుక ఉన్న కారణం ఏమిటంటే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి చైత్ర, వైశాఖ మాసాలు వచ్చేసరికి బిడ్డ పుడుతుంది. అంటే అది వేసవి కాలం మొదలయ్యే సమయంకావడం తో ఎండలకు పసిబిడ్డలు,బాలింతలు తట్టుకోవడం కష్టమని పెద్దలు ఈ నిబంధనను పెట్టడం జరిగింది.
పైగా ఆషాడ మాసం అంతా వర్షాలు తేమ ఉండడం వలన ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే ,పుట్టబోయే బిడ్డకు ఆ వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ అంటువ్యాధులు త్వరగా వ్యాపించి పుట్టబోయే బిడ్ద మీద వాటి ప్రభావం ఉంటుందని ఈ నియమం పెట్టడం జరిగింది. అందులో పిండానికిమొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి, ఆ సమయంలో అవయవాలు ఏర్పడే ప్రక్రియ మొదలవుతుంది..
కనుక ఈ నెలలో వధువు పుట్టింటి లో ఉండటమే క్షేమమని పెద్దల ఈ ఆచారాన్ని పెట్టారు.ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఇలాంటి శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే, మంచి సంతానం కలుగుతుందని పెద్దలు నమ్ముతారు. నిజానికి జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం చాల ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. అంతేకాదు, వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రత కి తల్లీబిడ్డలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్స్ త్వరగా కలుగుతుంటాయి. పైగా వేసవిలో సహజ ప్రసవం చాలా ఇబ్బందికరమైన విషయం అనే చెప్పాలి. అలాగే, డెలివరీ తర్వాత రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆస్పత్రుల్లో సరైన వైద్యం ఉండేది కాదు… అందువల్ల.. ఇలా ఆచారం పేరుతో భార్యాభర్తలు కలవకుండా వేరువేరుగా ఉండాలని చెప్పేవారు.