అసలుసిసలు రాజకీయాలకు నెలవవుతుంది ప్రస్తుతం ఏపీ రాజకీయం! ఏ క్షణం ఏమి జరుగుతుందో.. ఏ సమయానికి ఎవరు ఎక్కడ ఉంటారో.. ఏ రోజున ఎవరు ఎవరితో ఉంటారో.. ఎవరి వ్యూహాలు ఏమిటో.. మరెవరి ప్రతివ్యూహాలు ఎలానో తెలియని రసవత్తర ఘట్టాలు గతకొన్ని రోజులుగా ఏపీ కేంద్రంగా జరుగుతున్నాయి! ఇందులో భాగంగా అవతలి మొన్న కాంగ్రెస్ నేత, మొన్న ప్రజారాజ్యం నేత, ఇప్పటి తెలుగుదేశం నేత అయిన గంటా శ్రీనివాస రావు.. రేపు వైకాపా నేత అవుతారనే ప్రచారం పీక్స్ కి చేరింది. దీంతో ప్రస్తుతం గంటా చుట్టూ విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయన్నా అది అతిశయోక్తి కాదేమో!!
గంటా శ్రీనివాస రావు వైకాపాలోకి వస్తున్నారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ… దాన్నీ అడ్డుకునే క్రమంలోనో లేక ఆ ప్రచారంపై తన అభిప్రాయాన్ని చెప్పే క్రమలోనో తెలియదు కానీ.. గంటా శ్రీనివాస రావుకి సంబందించిన “సైకిళ్ల కొనుగోలులో అవినీతి” విషయాన్ని వెలుగులో తెచ్చారు. గంటా వైకాపాలోకి రావడంపై సాయిరెడ్డి అభిప్రాయం అది. ఇదే సమయంలో అదే జిల్లాకు చెందిన మంత్రి.. అవంతి శ్రీనివాస్ కూడా… “త్వరలో గంఅటా అరెస్ట్ అవ్వొచ్చు” అన్న సంకేతాలు ఇచ్చారు! దీంతో ఈయన అభిప్రాయం కూడా తేలిసిపోయింది!
దీంతో… అయినా కూడా ఈయన్ని వైకాపాలోకి తేవాలని ఒక బలమైన వర్గం ప్రయత్నిస్తోందని తెలుస్తొంది! దానికి గతంలో విశాఖ మేయర్ ఎన్నికలు జరిగిన అనంతరమో.. జరిగే ముందో గంటా శ్రీనివాస్ వైకాపాలోకి రావడం రాకపోవడంపై ఒక క్లారిటీ రావొచ్చని అంతా భావించారు. కానీ.. దానికి ముహూర్తం ఆగస్టు లోనే ఉండొచ్చని అంటున్నారు! ఇది ఇప్పుడు విశాఖ కేంద్రంగా హాట్ టాపిక్!
అవును… అన్నీ అనుకూలంగా జరిగితే ఆగస్టు 15 ఇళ్ల స్థలాల ముహూర్తం రోజునే గంటా శ్రీనివాస్ వైకాపాలోకి ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. ఆ వేదికపైనే పార్టీ మార్పు ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయాలపై జగన్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్! ఇంతకాలం గంటా శ్రీకృష్ణజన్మస్థానానికి వెళ్తారు అంటే… వైకాపాలోకి వస్తున్నారేంటి అనేది భారి సంచలనమే కదా!! ఏది ఏమైనా… ఆగస్టు 15 నాటికి గంటా వైకాపా రాకపై క్లారిటీ వచ్చేస్తాదన్నమాట!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?