నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. నివేదా థామస్, అదితీ రావు హైయదరి హీరోయిన్స్ గా నటించారు. ఎప్పుడో మే లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు. ఇన్నాళ్ళు డైలమాలో ఉన్న మేకర్స్ ఎట్టకేలకి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వి అమెజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు దాదాపు రూ. 30 కోట్లు ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్కు విక్రయించినట్లు తెలుస్తుంది. శాటిలైట్ రైట్స్ తో కూడా కలిపి మంచి లాభం వచ్చిందని చెప్పుకుంటున్నారు.
నాని ని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జెంటిల్మ్యాన్ మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు రాబోతున్న వి వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా. అంతేకాదు ఈ సినిమా నానికి 25వ సినిమా కావడం విశేషం. ఇక నాని ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దాంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్టు సమాచారం సెన్సార్ బోర్డు పెద్దగా కట్లు లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని అంటున్నారు.జగపతి బాబు, నాజర్, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కథ ఇదే అంటూ రీసెంట్ గా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నాని కి భార్యగా నటించిన అదితి రావును హత్య చేసిన వాళ్లను వరుసపెట్టి చంపేసే కిల్లర్ గా నాని కనిపిస్తాడని మర్డర్ చేసిన ప్లేస్ లో నాని వి అనే సింబల్ ని వదిలేస్తాడన్న ప్రచారం జరిగింది. మరి ఇదే కథ ..లేక అసలు కథ వేరేనా అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.