మొట్టమొదటిసారి సీఎం కుర్చీలో కూర్చున్న జగన్ పాలన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ప్రతి సర్వేలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకునేలా పరిపాలన అందిస్తూ వస్తున్నారు.
తాజాగా ఇటీవల ప్రముఖ సర్వే సంస్థ ఎబిపి-సి- ఓటర్ సర్వే లో కూడా ఇదే బట్టబయలు అవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న సీఎం లలో జగన్ మూడవ ర్యాంకు సాధించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా భారత్ ఆవిష్కరణ సూచీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో ర్యాంకు సాధించడం.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
గత ఏడాది పదవ స్థానంలో ఉండగా తాజాగా భారత్ ఆవిష్కరణ సూచీలో 10 నుండి ఏడవ ర్యాంకు కి వెళ్ళటం జరిగింది. నీతి అయోగ్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇన్నోవేషన్స్ ఇండెక్స్ 2020 విడుదల చేసిన నీతి అయోగ్.. 2019 గత ఏడాదికి గల మధ్య తేడా ను వివరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో నీతి అయోగ్ ప్రకటించిన స్కోరు చూస్తే.. సాధికారత విషయంలో 2019 వ సంవత్సరం లో 18.8 ఉండగా 2020లో 33.14 కి మెరుగుపడింది. ఇక పనితీరు విషయంలో 2019 వ సంవత్సరం లో 10.21 ఉండగా 2020లో 15.25 కి వచ్చింది. నాలెడ్జ్ అవుట్ ఫుట్ విషయానికొచ్చేసరికి 2019 వ సంవత్సరం లో 6.11 ఉండగా 2020లో 9.35 సాధించడం జరిగింది. ఇక విజ్ఞానం ఇస్తారనే విషయంలో కూడా 2019 వ సంవత్సరం లో 14.31 ఉండగా 2020లో 21.14 కి చేరటం జరిగింది.