సరిగ్గా వేసవి కాలం సమయం అది సినిమా ఇండస్ట్రీకి మంచి వ్యాపారం టైంలో ప్రముఖ సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన తరుణంలో మహమ్మారి రావడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో సినిమా ధియేటర్లు క్లోజ్ అవ్వటంతో వాడు సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు పర్మిషన్ లు వచ్చినా గానీ సినిమా ధియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేని నేపథ్యంలో చాలా సినిమాలు ఓటిటీ లో రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రిలీజ్ కావాల్సిన స్టార్ హీరోల సినిమాలు అన్నీ మొక్కుబడిగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. దీనిలో భాగంగా వచ్చే సంక్రాంతికి రామ్ పోతినేని నటించిన రెడ్, పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా “వకీల్ సాబ్”, రవితేజ- శృతి హాసన్ సినిమా “క్రాక్” అదేవిధంగా నాగచైతన్య “లవ్ స్టోరీ” మరికొన్ని సినిమాలు వచ్చే సంక్రాంతి కి రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో సంక్రాంతి పండుగకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా ధియేటర్ ల గొడవ స్టార్ట్ అవటం గ్యారెంటీ అనే టాక్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని థియేటర్ల దగ్గర ఈ సినిమాల నిర్మాతలు కర్చీఫ్ వేసుకున్నట్లు కూడా వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏదిఏమైనా మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఒక్కసారిగా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో… టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా థియేటర్ల వార్ స్టార్ట్ కానుంది అని చాలామంది అంటున్నారు.