హైదరాబాద్: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) నోటీసులు జారీ చేసింది. ఆర్టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది. ఈ నెల 28వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
ఆర్టిసి కార్మికుల ఆత్మహత్యలపై గత నెల 18వ తేదీన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు. కార్మికుల మరణాలు మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.