కోయంబత్తూరు: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోయంబత్తూరులో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. శ్రీలంక ద్వారా సముద్ర మార్గం నుండి ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రంలో చొరబడ్డారన్న సమాచారం ఆధారంగా మొత్తం ఐదు బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కొయంబత్తూరులో పట్టుబడిన అజరుద్దీన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేస్తున్నట్లు చేపట్టారు.
కొలంబోలో దాడుల తర్వాత తీర రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో పలు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు.