అమరావతి, జనవరి 4: విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్లో ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి బదలాయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించి. వైసీపీ నాయకులు కోరుతున్నట్టుగా కేసు విచారణను జాతీయ సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ 26న శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.