Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత అక్కినేని అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమా చేసింది. అలా అక్కినేని హీరోలతో కలిసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటించే అవకాశం చేజిక్కించుకుంది. పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సువర్ణ అవకాశాన్ని పొంది నిధి టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు నిధి అగర్వాల్ సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట హాట్టాపిక్గా మారాయి.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్కి
ప్రస్తుతం నిధి అగర్వాల్ డార్లింగ్ ప్రభాస్తో కలిసి మారుతీ డైరెక్షన్లో నటించబోతుందని టాక్. ఇలాంటి టైమ్లో “హీరోయిన్స్కి గ్లామర్ షో చేస్తేనే అవకాశాలు ఇస్తున్నారు, నటనను చూసి ఎవరూ గుర్తించడం లేదు, టాలెంట్ తో పాటు అందం కూడా ఉంటేనే పిలిచి అవకాశాలు ఇస్తారు” అంటూ నిధి షాకింగ్ కామెంట్స్ చేసింది. “ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరూ నటనకు ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం హీరోయిన్ అందంగా ఉందా? లేదా? అని మాత్రమే చూస్తారు. ఇప్పటి రోజులో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవారు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉన్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాలనీటిలో కూడా హీరోయిన్స్ తమ గ్లామర్ని ఎక్సపోజింగ్ చేస్తున్నారు…”
టాలీవుడ్ ప్రేక్షకులకు షాక్..!
“ప్రేక్షకులు కూడా అలా ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కాబట్టి నేను కూడా గ్లామర్ షో చేయడానికి అడ్డు చెప్పను. నా డైరెక్టర్ ఏది చెపితే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంతేకాకుండా, స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం అసలు వదులుకోను. వారు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా డిమాండ్ చేయకుండా తీసుకుంటాను. ఎందుకంటే స్టార్ హీరోలతో కలిసి నటిస్తే కెరీర్ తొందరగా సెట్ అవుతుందని నా ఒపీనియన్” అంటూ నిధి అగర్వాల్ హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ డాల్స్ అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె మాటలు చర్చనీయాంశమయ్యాయి.