మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మొగుతున్నాయి. కొత్త పెళ్లి కూతురు నిహారిక వివాహ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో కొణిదెల నిహారిక, చైతన్య ల వివాహ మహోత్సవం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఓ ఫైవ్ స్టార్ట్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరుగనున్నది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నూతన వధువు నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అయ్యింది.
ఆ ఫోటోలో ఇద్దరు యువతులు కనిపిస్తుండటంతో వాళ్లిద్దరూ ఎవరు ఎవరు అంటూ నెట్టింట చర్చ జరుగుతున్నది. అయితే ఈ ఫోటో లో ఉన్నది ఎవరో నిహారికే క్లారిటీ ఇచ్చింది. ఆ ఫోటో లో ఉన్న ఇద్దరు తన హిల్స్ ను సరి చేస్తున్నారని వెల్లడించింది. ఈ ఇద్దరు వధువు ను చక్కగా ముస్తాబు చేస్తారని నిహారిక పేర్కొన్నది. అందుకే వారితో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పింది. ‘లవ్ యు గర్ల్స్’ అంటూ వారితో కలిసి దిగిన ఫోటోను మెగా అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.