NIHARIKA: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీపై జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ సాగిన రాజకీయ రగడ పోసాని మాటలకు టర్న్ తీసుకుంది. పోసాని పవన్ కళ్యాణ్ పైనే కాకుండా ఆయన ఫ్యామిలీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ వర్సెస్ పోసాని వివాదం చెలరేగింది.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇచ్చిన ఆ టాస్క్ పై.. మండిపడుతున్న జనాలు..!!
NIHARIKA: పోసానిపై పంజాగుట్టలో కేసు నమోదు
రాజకీయ వివాదంలోకి ఆడవాళ్లను లాగడం దేనికని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పోసానిపై జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
మీమ్స్, వీడియోలతో రియాక్టైన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా పోసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ‘ఆస్క్ మీ’ సెషన్ ను నాగబాబు నిర్వహించి ఫ్యాన్స్ కు సమాధానాలు ఇచ్చారు. పవన్ మళ్ళీ హీరోగా చేస్తే తాను ఎంత డబ్బు ఇవ్వడానికైనా రెడీ అని, తనకు అంత డిమాండ్ ఉందని నాగబాబు తెలిపాడు. ఇండియాలోని టాప్ హీరోల్లో నాగబాబు కూడా ఒకరని ఆయన అన్నారు. 5, 10 కోట్ల డబ్బు కోసం పవన్ కళ్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేయరని అన్నారు. సమరసింహారెడ్డి సినిమాలోని సన్నివేశంలో బాలకృష్ణ కుక్క మొరిగిందనుకో అనే డైలాగ్ చెప్పిన మీమ్స్ ను చూపి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు మెగా ఫ్యాన్స్ కు నాగబాబు ఏది డైరెక్ట్ గా చెప్పకుండానే మీమ్స్, వీడియోల ద్వారా క్లారిటీగా చెప్పేశాడు. ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్ల వివాదంపై నాగబాబు ఫైర్ అయ్యాడు. విక్రమార్కుడు సినిమాలోని రవితేజ, బ్రహ్మానందం మీమ్స్ పెట్టి ఏది సరిగా పంచవు కదా అని ఏపీ సర్కార్ కు కౌంటర్ ఇచ్చాడు.
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కెమెరాల ముందు తన పరువు పరువు పోగొట్టుకుంటున్న యాంకర్ రవి..!!
మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలన్న నిహారిక
నాగబాబు పోసానిపై ఫైర్ అయిన తర్వాత ఆయన కూతురు, జనసేన పార్టీ నాయకురాలు అయిన నిహారిక కూడా తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానిపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ సినిమా కార్యక్రమంలో అయినా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆడవాళ్ల గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని, పవన్ కళ్యాణ్ పై ఇలా మాట్లాడటం ఎందుకో తమకు తెలుసని అన్నారు. జగన్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసినందుకే పోసాని క్రిష్ణ మురళి ఇలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడిన పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.
Pregnant: గర్భవతులు కుంకుమపువ్వు వాడొచ్చా ?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి??
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!