Nikhil Siddhartha: డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 1 సూపర్ హిట్ అయింది. ఇటీవలే దానికి సీక్వల్గా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. కార్తికేయ సినిమా కథ మొత్తం సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరుగుతుంది. అలానే కార్తికేయ 2 కథ మొత్తం కృష్ణుడు, ద్వారకా నగరం చుట్టూ తిరుగుతుంది. అసలు భగవంతుడిని మీద నమ్మకం లేని హీరో చివరికి ఆ భగవంతుడిపై నమ్మకం పెంచుకుంటాడు అని డైరెక్టర్ ఈ సినిమాలో చూపించాడు. ఈ కథతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు డైరెక్టర్ చందు మొండేటి. ఈ రెండు పార్ట్స్ చూసిన తరువాత ప్రేక్షకులకు 3వ భాగంపై మరింత ఆసక్తి పెంచుకుంటున్నారు.
Nikhil Siddhartha: ఇంట్రెస్టింగ్ న్యూస్
ఈ నేపథ్యంలోనే కార్తికేయ 3 గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిఖిల్ సిద్ధార్థ్ ఒక ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో కార్తికేయ 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో అందరినీ ఆకట్టుకుంది. దాంతో అందరూ కార్తికేయ 3 గురించి అడుగుతున్నారు. మేం ఆ సినిమాని తీసుకొచ్చే పనిలోనే ఉన్నాం. తొందరలోనే కార్తికేయ 3 సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ గురించి ఏమో కానీ పార్ట్ త్రీ తీయకపోతే మా మమ్మీ నన్ను చంపేసేలా ఉంది” అని చెప్పారు. దాంతో ఈ సినిమా కన్ఫామ్ అయ్యింది.
కథ ఏంటి
రాబోయే కార్తికేయ 3 కథ మొత్తం అయోధ్య రామ మందిరం గురించి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇక పార్ట్ 3లో నిఖిల్ రాముడు చుట్టూ తిరగబోతున్నాడేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లి వచ్చే ఏడాదిలో రిలీజ్ కావచ్చు. మళ్లీ ఇది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?