NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ ప్రశంస.. ! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

 

ఏపి సీఎం వైఎస్ జగన్, ఏపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం సీఎం వైఎస్ జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.  నాడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆ కోపం నిమ్మగడ్డ పదవీకాలం తగ్గించి ఇంటికి పంపించే వరకూ తీసుకువెళ్లింది. ఆ తరువాత నిమ్మగడ్డ హైకోర్టు ఉత్తర్వులతో తమ పదవికి మళ్లీ వచ్చారు. ఈ మధ్య కాలంలో కొద్ది రోజులు తమిళనాడుకు చెందిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కనకరాజ్ ఎస్ఈసీగా బాధ్యతలూ నిర్వహించారు. నిమ్మగడ్జ కూడా తనకు భధ్రత కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం, ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించడం లేదనీ, నిధులు విడుదల చేయడం లేదనీ హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డకు వైసీపీ నేతలు చంద్రబాబు మనిషి అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉండగా ప్రభుత్వం, వైసీపీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు రాష్ట్రంలో లేవని పేర్కొంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ అంటూ హెచ్చరికలు వస్తున్నాయని కారణం చెబుతున్నారు.

రాష్ట్రంలో కరోనా తగ్గినట్లే

ఇది ఇలా ఉంటే నేడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఒ విషయంలో ప్రశంసించడం ఆశ్చర్యాన్ని కల్గించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా చాలా వరకు తగ్గిందన్నారు. కరోనా కేసుల సంఖ్య పది వేల నుండి 753కి తగ్గిపోయాయని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషే కారణమని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ విధంగా నిమ్మగడ్డ ఎందుకు మాట్లాడారు అంటే రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గింది కాబట్టి  ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు లేవన్న భావనతో అన్నమాట.   తెలంగాణలోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు..?

ఎన్నికలు నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లేదనీ, పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ పేర్కొన్నారు.  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని అన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు అందరూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు.  ఆరోగ్య శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు నిమ్మగడ్డ, స్వేచ్చాయుత వాతావరణంలో, నిస్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju