హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస రావు, సుజనా చౌదరి బేటీ అవ్వటం వాటికి సంబంధించిన వీడియోలు బయటకు రావటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురు భేటీకి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే దిశగా సమావేశం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసలు రాజకీయ నాయకులతో సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముందు నుండి వైసీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ కి మద్దతు తెలిపే విధంగా రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్నారని ఆరోపిస్తూ ఉన్న సమయంలో ఈ వీడియో ఫుటేజ్ బయటపడటంతో సంచలనంగా మారింది.
తాజా ఈ ముగ్గురు భేటీ బట్టి చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ముందు నుంచి అండగా కామినేని శ్రీనివాస రావు ఉన్నాడని అర్థమవుతుందని ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ముగ్గురి బేటి వెనకాల చంద్రబాబు హస్తం ఉందని వైసిపి పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక అవుతున్న ప్రభుత్వాలను రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తుల చేత పడగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు.
ఆయన ఆటలను అరికట్టాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని అంబటి డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పూర్తి సాక్షాలు వీడియో రూపంలో ఉండటంతో త్వరలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విధంగానే కులా దోయ్యాలని బాబు ప్రయత్నించారు, అప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. ఇప్పుడు పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని, ఇది ఈ వీడియోలో దొరికిపోవడం జరిగిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.