నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ప్రభుత్వ వాదనను కొట్టి వేసి తిరిగి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పదవీ బాధ్యతలు అప్పజెప్పాలని తీర్పు ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కి వెళ్లి హైకోర్టు తీర్పును సవాలు చేయడం జరిగింది . తాజాగా ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి గట్టిగా దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కి మొట్టికాయలు పడినట్లయింది.
అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాజే స్పందిస్తూ, రాజ్యాంగ పదవిలో వున్నవారిని ఎలా తొలిగిస్తారని ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరుణంలో తనని తప్పించడానికి ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేయడంతోపాటు అనేక నిందలు మోపటం తో తాజాగా వచ్చిన తీర్పు రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటు హైకోర్టులోనే అటు సుప్రీంకోర్టులోనూ తనకి ఫుల్ సపోర్ట్ గా తీర్పు రావడంతో సిక్సర్ కొట్టినంత జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా గవర్నర్ కి ఎన్నికల కమిషనర్ నియమించే అధికారాలు ఉండటంతో… త్వరలో ఏపీ గవర్నర్ ని కలిసి మళ్లీ SEC కుర్చీ ఎక్కే పక్కా ప్లాన్ న్యాయ నిపుణులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చిస్తున్నట్లు టాక్.