ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు విషయంలో నువ్వానేనా అన్నట్టుగా స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ ఎన్నికల విషయంలో క్షణక్షణానికి పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదలచేసిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తెలపగా, మరోపక్క హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం లో సవాల్ చేసిన ప్రభుత్వానికి పిటిషన్ లో తప్పులు ఉన్నాయని సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది మధ్యలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఏపీ రాజకీయాల్లో నెలకొంది.
మరోపక్క ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఈరోజు మరి కొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ అధికారులు ఎన్నికల నిర్వహణ విషయంలో.. వెనకడుగు వేస్తూ వస్తున్నారు. ఒకపక్క వ్యాక్సిన్ ప్రక్రియ పంపిణీ జరుగుతూ ఉన్న సమయంలో ఈ టైంలో ఎన్నికలు విధులు నిర్వహించాలంటే కష్టమని తెలుపుతున్నారు.
ఇలాంటి తరుణంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇవ్వటమే కాక కలెక్టర్లకు ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 2021 ఓటర్ల జాబితా తమవద్దకు ఏదీ రాలేదని కలెక్టర్లు ఎస్ఈసి కి చెప్పినట్లు సమాచారం. చాలా వరకు ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు ఎస్ఈసి ఇస్తున్న ఆదేశాలు పట్టించుకోవటం లేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోపక్క కావాలనే అధికారులు కోర్టు ఆదేశాలు ఉన్నాగాని పట్టించుకోవడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈరోజు మధ్యాహ్నం కల్లా ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులను హడలెత్తించడానికి అవసరమైతే చర్యలు కూడా తీసుకోవడానికి నిమ్మగడ్డ డేరింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. దీంతో మరికొద్ది రోజుల్లో పదవి నుండి తొలగిపోయే నిమ్మగడ్డ విషయంలో మాట వింటే.. రాబోయే నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి కాబట్టి ఏమవుతుందో అన్న టెన్షన్ లో.. ఏం చేయలేని స్థితిలో అధికారులు ఉన్నట్లు టాక్.