ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జులై 30వ తేదీన సుప్రీంకోర్టు, హై కోర్టు ఆర్డర్ల మేరకు తిరిగి తన పదవిలో గవర్నర్ గా నియమితులయ్యారు. అంతకుముందు కొద్దినెలలవరకూ విపరీతమైన గడ్డు పరిస్థితిని అనుభవించిన రమేష్ కుమార్ ప్రస్తుతం ఏపీలో తనదైన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
తాజాగా మీడియా వర్గాలలో వస్తున్న కథనం ఏమిటంటే.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ నిర్ణయించిందట. పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ ప్రక్షాళన పూర్తి చేశారని…. ఇక తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన చెప్పినట్లు బయటికి వార్తలు వచ్చాయి. వెంటనే వీటిపై నిమ్మగడ్డ స్పందించారు.. ఇవన్నీ… ఒట్టి కట్టుకథలు అని.. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు.
నిజంగా మీడియాలో కథనాలు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జగన్ నిమ్మగడ్డ రిటైర్మెంట్ తర్వాత తీరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకుందాం అని అనుకుంటున్నారు. నిమ్మగడ్డ ఇలా చేయడం ప్రభుత్వానికి భారీ షాక్ అవుతుంది అని చెప్పాలి. అయితే వైసిపికి అదృష్టవశాత్తు అటువంటిది ఏమి జరగలేదు. ఎన్నికల కమిషన్ ఎటువంటి షెడ్యూల్ విడుదల చేయలేదని ఖరారు చేసింది. ఇక ఇదే సమయంలో కమిషన్ నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటనలు రాకపోయినా సోషల్ మీడియా రిపోర్తుల ద్వారా పలు ఫేక్ షెడ్యూల్స్ ద్వారా ఈ వార్త ప్రచారం చేసిన వారిపై యాక్షన్ తీసుకోనున్నారని సమాచారం. రమేష్ కుమార్ అందుకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇలా ఫేక్ పోస్టులు పెట్టి ప్రజలను మోసం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన షెడ్యూల్ ఏమిటంటే సెప్టెంబర్ 9న ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 11కి పూర్తవుతుందని పోలింగ్ సెప్టెంబర్ 21 న కాగా సెప్టెంబర్ 24న కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికలకు సెప్టెంబర్ 11-13 వరకు నామినేషన్స్ జరిగి…. సెప్టెంబర్ 23 న పోలింగ్, సెప్టెంబర్ 27న ఓట్ల లెక్కింపు ఉంటుంది అని చెప్పారు. అసలే చిరాకు లో ఉన్న నిమ్మగడ్డకు ఈ వార్త బయటకి రావడంతో ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేయించేదాకా ఆయన వదలరని ఎన్నికల కమిషన్ ఆఫీస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.