స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందంటూ స్టేట్ ఎలెక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఒక నోటిఫికేషన్ బయటకు వచ్చింది. ఈ నెల 21న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో ఉంది. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని నిమ్మగడ్డ క్లారిటీ ఇచ్చారు.
ఇది తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని అనుమానం వ్యక్తం చేసారు. అలాగే ఇటువంటి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. సీపీ సహా సత్యనారాయణ పురం పీఎస్, సైబర్ పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసారు. మొదట మార్చ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ విషయంలోనే ఆయనకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?