Nimmagadda Ramesh Kumar : నిమ్మగడ్డ కి ఆ అధికారం లేదు అంటున్న వల్లభనేని వంశీ..!!
Nimmagadda Ramesh Kumar : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య నువ్వా నేనా అన్నట్టు వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉంటూ అది కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సొంతంగా యాప్ క్రియేట్ చేయడానికి అసలు అధికారం ఆయనకు లేదు అంటూ నిమ్మగడ్డ పై వల్లభనేని వంశీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బాధ్యత మరచి లక్ష్మణ రేఖ దాటినటు నిమ్మగడ్డ వ్యవహారం ఉందని పేర్కొన్నారు.నిమ్మగడ్డ దూకుడుగా వ్యవహరిస్తున్నారు పర్సనల్ గా ఎన్నికలను తీసుకుంటున్నారు అంటూ వంశీ పేర్కొన్నారు.
అంతేకాకుండా ఓటర్ లిస్టు సవరించే సమయం కూడా ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం, ఆ తప్పును అధికారులపై నెట్టడం దారుణమని అన్నారు. ఇదిలా ఉంటె 2011వ సంవత్సరంలో ఏకగ్రీవాలు చంద్రబాబు ప్రోత్సహించారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆ టైంలో 1154 జీఓ కూడా జారీ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని, ఏకగ్రీవాలు వద్దంటూ ఇప్పుడు ఆయన మాట్లాడటం బట్టి చూస్తే ఆయన మెదడు చెదిరినట్టుంది, గతం మరిచిపోయారా అంటూ వంశి సెటైర్లు వేశారు. సొంత కొడుకుని గెలిపించుకోలేక పోయాడు, మోడీ, కెసిఆర్, జగన్ పేరు వింటే చంద్రబాబు కి బొట్లు బొట్లుగా కారుతుంది అంటూ వల్లభనేని వంశీ భారీ స్థాయిలో డైలాగులు వేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?