ఏపీ ఎన్నికల కమీషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. నిమ్మగడ్డ ఆ పదవి మళ్లీ చేపట్టకుండా రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు సాగిస్తుండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు బహిరంగంగా మద్దతు ఇవ్వటం ఇక్కడ గమనార్హం.
పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కన్నా రాష్ట్ర సారథి కావడం, గవర్నర్ కూడా కేంద్రంచే నియమితులైన వారే కావడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఢిల్లీ స్థాయిలోనే ఏదో జరుగుతోందన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.ఏపీ ఎన్నికల కమీషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియమించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని లక్ష్మినారాయణ తన లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థ విషయంలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని రాష్ట్ర అధిపతిగా పరిరక్షించడంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ విశ్వభూషణ్ను కన్నా కోరారు.ఇది ఢిల్లీ లెవల్ స్క్రిప్టే మోనని అనుమానాలు కూడా కలుగుతున్నాయి