Nimmagadda Ramesh Kumar : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసిపి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తన చేతిలో ఉన్న మొత్తం అధికారాలను ఉపయోగిస్తూ వైసిపి పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. నిన్న మొన్న రాయలసీమ ప్రాంతంలో పర్యటించిన నిమ్మగడ్డ తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ కి నిమ్మగడ్డ లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు తీసేసే రీతిలో లెటర్ రాయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి కూడదని చీఫ్ సెక్రెటరీ కి నిమ్మగడ్డ లెటర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికలు జరిగే సమయంలో వారు ప్రభుత్వ వాహనాలు అదేవిధంగా ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించకూడదని ఆదేశించారు. ఇదే క్రమంలో ప్రైవేట్ వాహనాలు వినియోగించిన గాని ప్రభుత్వం కల్పించిన హోదాను నంబర్ ప్లేట్ పై లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాలు సదుపాయాలు ఇలాంటివి కూడా ఎన్నికల సమయంలో ఉపయోగించకూడదు , చైర్మన్లు తమతో ప్రభుత్వ అధికారులను తీసుకెళ్లకూడదు అని పేర్కొన్నారు. ఈ విధంగా నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల వేళ తన చేతిలో ఉన్న మొత్తం అస్త్రాలను వాడేస్తూ వైసీపీ ప్రభుత్వానికి క్షణక్షణానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.