(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వేగంగా వెళుతున్న మినీ బస్సు వెనుకనుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా ముందు వైపు కూర్చున్న ప్రయాణీకులంతా సీట్ల మధ్య ఇరుక్కుపోయిన కారణంగా మృతి చెందినట్లు భావిస్తున్నారు. పది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో అయిదుగురు ఆసుపత్రికి తరలించిన తరువాత మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అనుకుంటున్నారు.