న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు కొద్ధి రోజుల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారని ప్రచారం జరుగుతుండగా దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్ష చేయాలని పిటిషన్లో కోరాడు. అక్షయ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించింది. నిందితుడి తరఫు న్యాయవాది ఎపి సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ అక్షయ్ రివ్యూ పిటిషన్పై తీర్పు వచ్చిన తర్వాత నిందితులందరూ కలిసి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం గురించి ఆలోచిస్తామని తెలిపారు. 2018 జులై తొమ్మిదిన అక్షయ్ సింగ్ మినహా మిగిలిన ముగ్గురు నిందితులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది.
2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో అత్యంత హేయంగా నిర్భయపై ఆరుగురు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రగాయాలపాలైన నిర్భయ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందుకు హజరుపర్చారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో అతడికి తప్ప మిగతా అందరికీ 2017లో ఉరిశిక్షను విధించారు. నిందితుల్లో ఒకరు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు తీహర్ జైలులో ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?