ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై బీజేపీ వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు రాజకీయ పరంగా ఇటు పాలనాపరంగా వైసీపీ ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడమే వారి ఎజెండాగా కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకూ రాష్ట్ర రాజకీయాలు వరకే పరిమితమైన ఈ విమర్శలు ఇప్పుడు కేంద్రం నుంచి కూడా రావడం ఇక్కడ విశేషం.వివరాల్లోకి వెళితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ ప్రభుత్వం పై ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడ్డారు. రాష్త్రాల అభివృద్ధికి తమ కేంద్రం ఎప్పుడూ కట్టుబడి ఉందని… అయితే జగన్ తీరు మాత్రం వేరేలా ఉందని ఆమె ఎద్దేవా వేశారు.
కేంద్రం యూనిట్ విద్యుత్ కు రూ 2.70 కే ఇస్తోందని.. మరి ఏపీలో మాత్రం యూనిట్ కు రూ. 9 చార్జ్ చేస్తున్నారని అన్నారు. యూనిట్ కు రూ. 9 చెల్లించి ప్రజలు ఎలా బ్రతుకుతారు అని నిర్మల సీతారామన్ నిలదీశారు.
ఇకపోతే ఏపీకి ఏప్రిల్ నుంచి 8వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ముట్టిందని చెప్పిన ఆమె అక్రమాలను తేలుస్తామని చెప్పిన జగన్ అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవడం కూడా మంచిదే అని అన్నారు. అయితే వరల్డ్ బ్యాంకు నిధులతో జరిగిన ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడకుండా చూడాలని… అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాలను రాష్ట్రాలు గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని ఆమె హితవు పలికారు. ప్రభుత్వ చర్యలతో భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది రాకుండా చూడాలని జగన్ ను హెచ్చరించడం జరిగింది.
ఇక నిర్మల సీతారామన్ అన్న మాటలకు వైసిపి వర్గాలు మిగతా వారిపై విరుచుకుపడ్డట్లు విరుచుకుపడతారా లేకపోతే ఆమె అన్నది మమ్మల్ని కాదు అన్నట్లు ఊరికే ఉంటారా అన్న విషయం వేచి చూడాలి.