Nirmala Sitharaman : కరోనా కాలం తర్వాత… ఎన్నో అంచనాలతో రూపొందించిన కేంద్ర బడ్జెట్ సోమవారం దేశ ప్రజల ముందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman ప్రవేశపెట్టారు. దిగువ మధ్య తరగతి ప్రజానీకానికి కొత్తగా ఎలాంటి ప్రయోజనాలు కనిపించని బడ్జెట్ గా కీర్తి కెక్కిన ఈ బడ్జెట్ లో తాజాగా కేంద్రం కొత్త పన్నులతో ప్రజల నడ్డి విర కొట్టడానికి తయారయింది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గుతుందని కచ్చితంగా ఈ బడ్జెట్ లో మంచి వార్త వింటారు అని అందరూ అనుకుంటున్న సమయంలో… పెట్రో ఉత్పత్తులపై కొత్త పన్నులు వేసి అవి మరింత పెరిగేలా కేంద్ర బడ్జెట్ కనిపించింది. కొత్తగా మోడీ ప్రభుత్వం బడ్జెట్లో అగ్రి సెస్ తీసుకు వచ్చింది. ఈ కొత్త రకపు పన్ను ఇటు పెట్రో ఉత్పత్తులు మద్యం బంగారంతో పాటు వివిధ వస్తు ఉత్పత్తులపై భారీగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఒకే దేశం ఒకే పన్ను అంటూ జీఎస్టీ ని తీసుకు వచ్చిన సమయంలో నినాదం ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త పనులను వేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమవుతోంది.
అగ్రి సెస్ అంటే!
- మోడీ ప్రభుత్వం అగ్రి సెస్ పేరుతో తీసుకువచ్చిన కొత్త పన్ను రైతులకు ఎలాంటి ప్రయోజనం కల్పించదు. రైతులకు ప్రత్యేక నిధి పెట్టని వారికి ప్రయోజనం కల్పించేలా వచ్చిన పన్ను వారికి చెందేలా ఎలాంటి కొత్త అంశాలు దీనిలో లేవు. కేవలం అగ్రి సెస్ పేరు మాత్రమే తప్ప అన్నదాతకు కొత్తగా వచ్చిన ప్రయోజనం ఏమీ ఈ పని వల్ల లేదు.
- బంగారం వెండి ఇతర కమోడిటీస్ ఉత్పత్తులపై 2.5 శాతం వరకు పన్ను ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా వినియోగదారులపైనే పడుతుంది.
- మద్యం ఉత్పత్తులు ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 100% అగ్రి సెస్ ఉంటుంది. అంటే దేశ వ్యాప్తంగా మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి అన్నమాట.
- క్రకుడ్ పామ్ ఆయిల్ పైన 17.5 శాతం.. సన్ ఫ్లవర్ ఆయిల్ మీద 20 శాతం పన్ను ఉంటుంది.
- ఆపిల్స్ మీద 35, బొగ్గు మీద 1.5, యూరియా మీద 5 శాతం చొప్పున పన్ను ఉంటుంది.
- బఠాణి మీద 40, తృణ ధాన్యాలు మీద 20 శాతం, కాటన్ మీద 5 శాతం మేర పన్ను ఉంటుంది.
ఏమైంది ఒకే పన్ను!
ప్రభుత్వం మూలిగే నక్క మీద తాటిపండు వేసిందని అసలే కరోనా టైం లో పూర్తిగా ఆదాయవనరులు సంబంధించిన జనజీవనానికి కొత్త పన్ను విఘాతం కలిగిస్తోందని ప్రతిపక్షాల మాట. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం జిఎస్టి తీసుకు వచ్చిన సమయంలో ఒకే పన్ను ఒకే దేశం ఉంటేనే బాగుంటుందని… అతి పెద్ద నినాదాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఉన్న పనులను క్రమంగా తీసేస్తారు అని భావిస్తే… దానికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం కొత్త పనులను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దడం చూస్తే ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన చేస్తుంది అన్నది అర్థం అవుతుంది. ఈ కొత్త పన్నులపై కొత్త బాదుడిపై ప్రతిపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తుంటే… ప్రభుత్వం మాత్రం ఈ సమయంలో ఇది అత్యవసరం అన్నట్లు వాదిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?