Nissan Magnite Compact SUV : నిస్సాన్ ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం..ఇటీవల తన నిస్సాన్ మ్యాగ్నెట్ కాంపాక్ట్ ఎస్ యూవి ను విడుదల చేసింది.. ఈ ఎస్ యూవి మార్కెట్ లో విడుదల అయినప్పటి నుండి విశేష ప్రజాదరణ పొందింది.. దీని వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది.. తాజాగా నిస్సాన్ మ్యాగ్నెట్ ఎస్ యూవి టాప్ -10 కార్ల అమ్మకాల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.. మార్కెట్లో విడుదల అయిన అతి కొద్ది రోజులలోనే చరిత్ర సృష్టించింది..
ఈ ఎస్ యువి ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 33,000 యూనిట్ల బుకింగ్ లు వచ్చాయి. ఈ కొత్త మ్యాగ్నెట్ 4567 యూనిట్లు కేవలం గత ఒక్క నెలలోనే విక్రయించి టాప్ -10 కార్ల అమ్మకాల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇందుకోసం ఎంజి మోటార్ , ఫోక్స్వ్యాగన్, ఫియట్, ఫోర్డ్, స్కోడా వంటి కార్ల అమ్మకాలు అధిగమించింది. 2020 డిసెంబర్ లో నిస్సాన్ ఇండియా 599 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నిస్సాన్ ఇండియా ఈ నెల అమ్మకాలలో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. దీంతో కంపెనీ అమ్మకాలలో ముందంజలో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 5.49 లక్షలు. ఈ ఎస్ యు వి కార్ కియా సొనెట్, టాటా నెక్సన్, మారుతి సుజుకి విటారా బ్రేజ్జా, హోండా wrv, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా ఎస్ యు వి 300 వంటి మోడల్స్ కు ప్రత్యర్థి గా నిలుస్తోంది.
రాజమండ్రి లోని కంటిపూడి నిస్సాన్ డీలర్ షిప్ లో మెగా డెలివరీ డ్రైవ్ ను నిర్వహించింది. ఒక్క రోజులోనే 36 మంది కస్టమర్లకు నిస్సాన్ మ్యాగ్నెట్ లను డెలివరీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెంగుళూరు కు చెందిన సన్నీ నిస్సాన్ డీలర్ షిప్ ఒక్క రోజు లోనే 100 మంది కస్టమర్లకు నిస్సాన్ మ్యాగ్నెట్ లను డెలివరీ చేసి రికార్డ్ సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే .. నిస్సాన్ మ్యాగ్నెట్ కాంపాక్ట్ ఎస్ యూవి ను విడుదల చేసినప్పటి నుంచి వరుస రికార్డ్స్ సృష్టిస్తుంది..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?