యంగ్ హీరో నితిన్ ఇప్పుడు వరస సినిమాలతో హల్చల్ చేస్తోన్న విషయం తెల్సిందే. భీష్మ విడుదలకు ముందు నితిన్ ఖాతాలో వరస ప్లాపులు ఉన్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో నితిన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో నాలుగు చిత్రాలు ఉండడం విశేషం.
నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. నితిన్ సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరోవైపు హిందీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అందాధూన్ రీమేక్ లో నితిన్ నటించబోతున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్లుగా నభ నటేష్, తమన్నా ఎంపికయ్యారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
దాని తర్వాత నితిన్ తన స్నేహితుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమాలో కూడా నటించనున్నాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. అయితే నితిన్ మరో సినిమాను కూడా చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా మొదలైంది. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. చెక్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
అయితే గత కొంత కాలం నుండి ఈ సినిమా గురించి ఏ అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందేమోన్న సందేహాలు బయటకు వచ్చాయి. అయితే ఆ రూమర్స్ కు రెస్పాండ్ అయ్యారో లేక నిజంగానే ముహూర్తం కుదిరిందో కానీ అక్టోబర్ 1న సాయంత్రం 4:30 నిమిషాలకు ఈ చిత్ర టైటిల్ అండ్ ప్రీ లుక్ ను రివీల్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సినిమా ఆగిపోలేదు అన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గానే ధృవీకరించాడు నితిన్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!