Nithin : యూత్ స్టార్ నితిన్ నటించబోయే సినిమా ఒకటి ఆగస్టు నుంచి సెట్స్ మీదకి రానున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ రచయిత దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. స్టార్ మేకర్ ఠాగూర్ మధు నిర్మించబోతున్నారు. త్వరలో ఇందులో నటించే హీరోయిన్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నట్టు తెలుస్తోంది.
నితిన్ ‘భీష్మ’ సక్సెస్తో మంచి ఫాంలోకి వచ్చి వరుసగా ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘చెక్’, ‘రంగ్ దే’ సినిమాలతో వచ్చాడు. కానీ నితిన్కి ఈ రెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయినా తన దూకుడు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాదున్’ తెలుగు రీమేక్ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్నా కీలక పాత్రలో కనిపించబోతోంది.
Nithin : ‘పవర్ పేట’ ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి.
ఇక ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ చేతిలో ఉండగానే దర్శక, రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుండగా ఆగస్టు నుంచి సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయట. అయితే ఆ మధ్య ‘పవర్ పేట’ ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ ప్లేస్ లో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడా లేక రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడా అనేది త్వరలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం వక్కంతం వంశీ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్న పవన్ కళ్యాణ్, అఖిల్ సినిమాలకు కథలు అందిస్తున్నాడు.