నితిన్ భీష్మ లాంటి భారీ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా రంగ్ దే. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. పిడివి సమర్పణలో సితార ఎంటర్మైంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. అయితే ఆ మధ్య ఈ సినిమా సంక్రాంతి బరిలో దింపుతామన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పుడు ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత మొదలై శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్.
క్రిస్మస్ పండుగతో పాటు వైకుంఠ ఏకాదశి పండుగలను పురస్కరించుకొని నితిన్ కీర్తి సురేష్ జంటగా ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ లేటెస్ట్ పోస్టర్ లో సినిమా రిలీజ్ విషయాన్ని మాత్రం తెలపలేదు. దాంతో రంగ్ దే సినిమా సంక్రాంతి బరిలో దిగడం లేదని క్లారిటీ వచ్చేసింది. షూటింగ్ ఇంకా చాలా జరగాల్సి ఉండటంతో 2021 లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నా కూడా డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదని సమాచారం.
ఇక ఈ సినిమా తో పాటు బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తున్నారు. మేర్ల పాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ అన్న సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ని ఏప్రిల్ లేదా మే లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.