Nithya Menen: టాలీవుడ్లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలోనూ టాలెంటెడ్ హీరోయిన్గా నిత్యా మీనన్కు మంచి క్రేజ్ ఉంది. గత ఏడాది బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఊహించని విధంగా లెస్బియన్ పాత్రలో నటించి షాకిచ్చింది. ఇప్పటివరకు చేసిన తెలుగు, తమిళ సినిమాలో కనీసం రొమాంటిక్ సీన్ కూడా చేయలేదు. లిప్ లాక్స్, ఎక్స్ఫోజింగ్ క్యారెక్టర్కు నిర్మొహమాటంగా నో చెప్పింది. అలాంటిది బాలీవుడ్లో చేసిన వెబ్ సిరీస్లో ఎలా మరో అమ్మాయితో పెదవి ముద్దు ఇచ్చిందనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఇక ఏ సినిమా అయినా నిత్యా కథ నచ్చితేనే సైన్ చేస్తుంది.
తప్పకుండా సినిమాలో కథ, కథనం ఆమె పాత్ర గొప్పగా ఉంటే తప్ప కమిటవదు. అందుకే నిత్యా మీనన్ అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళవుతున్నా తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. ప్రస్తుతం మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన అయ్యప్పనమ్ కోషియమ్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ సినిమాలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా కూడా ఆమె పాత్ర నచ్చే ఒప్పుకుంది. ఆమె నటిగా సినిమా ఒప్పుకోవడానికే ఇంత పక్కాగా ఉంటుందంటే అదే నిర్మాతగా అయితే ఇక కథ విషయంలో ఇంకెంత పక్కాగా ఉంటుంది.
Nithya Menen: ఆసక్తి మొత్తం ఒక్క షోతో దెబ్బైపోయింది.
అందుకే ఆమె నిర్మాతగా మారి నటిస్తూ నిర్మించిన స్కై ల్యాబ్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కానీ ఆసక్తి మొత్తం ఒక్క షోతో దెబ్బైపోయింది. అసలు నిత్యా మీనన్ దేని ఆధారంగా ఈ స్కై ల్యాబ్ కథను సినిమాగా నిర్మించాలనుకుందో అర్థం కాక విశ్లేషకులే జుట్టు పీక్కుంటున్నారు. సీరియస్, ఎమోషనల్గా సాగాల్సిన కథను సగటు ప్రేక్షకుడుని ఏమాత్రం ఆకట్టుకోలేని విధంగా రూపొందించారు. కథల విషయంలో నిత్యా మీనన్ జడ్జ్మెంట్ ఆమె నటించడానికే తప్ప సినిమా నిర్మాణంలో మాత్రం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సత్య దేవ్ లాంటి టాలెంటెడ్ హీరో ఉన్నా ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుందని అంటున్నారు.